twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ జగన్నాధ్ మెయిల్ కి 'అవతార్' దర్శకుడు రిప్లై

    By Srikanya
    |

    జేమ్స్ కెమెరాన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'అవతార్' చిత్రం అద్బుతమైన కలెక్షన్స్ తో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రివ్యూ చూసిన రామ్ గోపాల్ వర్మ తన రివ్యూ(ని తన బ్లాగ్ లో రాసారు. అయితే ఆ రివ్యూ ని చదివిన పూరీ జగన్నాధ్ దాని కాపీని జేమ్స్ కెమెరాన్ కు ఈ మెయిల్ చేసారు. ఈ విషయాన్ని ఆయనే ఈ మధ్యన ఓ ప్రముఖ టీవీ ఛానెల్ తో చెప్పుకొచ్చారు. తను చదివిన వర్మ రివ్యూ లో మొదటి వాక్యం ఐ హేట్ జేమ్స్ కెమెరాన్ అన్నదే అధ్బుతంగా ఉందని..దాని అర్ధం జేమ్స్ కెమెరాన్ అంటే అసహ్యమేస్తోందని..ఎందుకంటే మిగతా వాళ్ళని ఆయన సినిమా తీసి మిగతా డైరక్టర్స్ ని చీమలగా మార్చేసాడని రాసారు.అలాగే ఇండియాలో వందకీ,రెండు వందల రూపాయలకూ చూడాల్సిన చిత్రం కాదు..అని వర్మ రాయటం గొప్పగా ఉందన్నారు.

    ఆ వాక్యాలు చదివిన తర్వాత వరల్డ్ లో వర్మ గారు రాసిన రివ్యూ కన్నా గొప్ప రివ్యూ ఎవరూ రాసి ఉండరనిపించింది అన్నారు. దాంతో తనకు ఈ రివ్యూను జేమ్స్ కెమెరాన్ కు పంపిస్తే ఏమిటి అన్న ఆలోచన వచ్చింది. దాంతో ఆయన కాంటాక్ట్ ట్రై చేసాను. ఆ క్రమంలో కెమెరాన్ కు ఎర్త్ షిప్ కార్పోరేషన్ అనే కంపెనీ ఉందనీ దానికి సీఈఓ రేచల్ బైండర్ అనీ తెలిసింది. ఆయన ద్వారా ఈ బ్లాగ్ ను కెమెరాన్ కు పార్వడ్ చేసి రాము గారి ఈమెయిల్ ఎడ్రస్ కూడా పంపాను. వెంటనే జేమ్స్ కెమెరాన్ చూసి రాము గారికి వెంటనే రిప్లై ఇచ్చారు. ఆయన రిప్లైలో ధాంక్యూ ఫర్ యువర్ జెన్యూన్ ఎక్సప్రెషన్ అని రాసారు. జేమ్స్ కెమెరాన్ వంటి దర్శకుడు రెస్పాండ్ అవటం హ్యాపీ అనిపించింది అని పూరీ ఆనందంగా చెప్పుకొచ్చారు. ఈ విషయం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ అంతటా హాట్ టాపిక్ అయ్యింది. పూరీ ఇలా టీవీల్లో కనపడి..వర్మ గారిని ప్రమోట్ చేస్తున్నాడా లేక అవతార్ ని ప్రమోట్ చేస్తున్నాడా అనే డైలమోలో అంతా పడ్డారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X