సినీ నటి జమున భర్త మృతి
హైదరాబాద్: అలనాటి చలనచిత్ర నాయిక జమున భర్త రమణారావు (86) సోమవారం రాత్రి గుండె పోటుతో మృతి చెందారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రమణారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు.
వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి అమెరికాలో ప్రొఫెసర్గా పనిచేస్తుండగా అమ్మాయి చిత్రకళాకారిణి. రమణారావు భౌతిక కాయానికి మంగళవారం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక చిన్న వయస్సులోని చిత్ర రంగంలో ప్రవేశించిన జమన ను ..రమణారావు... 1965 వివాహం చేసుకున్నారు. రమణారావు ఎస్వీ యీనివర్సిటిలో ప్రొఫిసెర్ గానూ పనిచేసారు. వీరికి కుమార్తె స్రవంతితో పాటు కుమారుడు ఉన్నారు. రంగారావు మృతికి పలువురు తెలుగు సినీ రంగ ప్రముఖులు సంతాపం తెలియచేసారు.
తనకు వివాహం అయ్యాక కూడా సినిమాల్లో నటించేందుకు తన భర్త ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని జమున చాలా సార్లు చెప్పుకొచ్చారు. అయితే చివర్లో వీరి కుమార్తె స్రవంతి వరకట్న వేధింపులు ఎక్కువ అవటంతో ఈ దంపతులు బాధ పడ్డారు. ఇలాంటి సంఘటనలు మినహా వీరి జంట ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
వన్ ఇండియా తెలుగు... రమణారావు గారి మృతికి నివాళులు అర్పిస్తోంది.


Click it and Unblock the Notifications











