Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కె విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రల్లో
కె.విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రల్లో రచయిత జనార్థనమహర్షి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. 'దేవస్థానం"టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని సర్వేజనా సుఖినోభవంతు ఫిలిమ్స్, గురుదేవా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. అక్టోబర్లో ప్రారంభమయ్యే ఈ చిత్రంలో దక్షిణ భారతదేశానికి చెందిన ప్రఖ్యాత నాట్యకళాకారిణి అరంగేట్రం చేయబోతున్నారు. అలాగే మూడు తరాల ప్రసిద్ధ గాయనీ గాయకులు ఇందులో పాటలు పాడుతుండటం విశేషం.
6 పాటలు, రెండు హరికథలు, ఒక మ్యూజికల్ సింఫొనీ ఉంటాయి. ఈ చిత్రానికి సురేష్ వి.యన్.కుమార్ ఛాయాగ్రహణం, స్వరవీణాపాణి సంగీతం సమకూరుస్తారు. పలు కళారంగాల్లోని ప్రముఖులు ముఖ్యపాత్రల్లో నటించే ఈ చిత్రాన్ని 'నంది శ్రీహరి" సమర్పించనున్నారు. నంది శ్రీహరి 'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రంతో నిర్మాతగా మారారు. జగపతి బాబు, ఛార్మి కాంబినేషన్ లో రూపొందిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఇక జనార్దన మహర్షి గతంలో గోడ మీద పిల్లి చిత్రంతో దర్శకుడుగా మారారు.