Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కె విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రల్లో
కె.విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రల్లో రచయిత జనార్థనమహర్షి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. 'దేవస్థానం"టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని సర్వేజనా సుఖినోభవంతు ఫిలిమ్స్, గురుదేవా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. అక్టోబర్లో ప్రారంభమయ్యే ఈ చిత్రంలో దక్షిణ భారతదేశానికి చెందిన ప్రఖ్యాత నాట్యకళాకారిణి అరంగేట్రం చేయబోతున్నారు. అలాగే మూడు తరాల ప్రసిద్ధ గాయనీ గాయకులు ఇందులో పాటలు పాడుతుండటం విశేషం.
6 పాటలు, రెండు హరికథలు, ఒక మ్యూజికల్ సింఫొనీ ఉంటాయి. ఈ చిత్రానికి సురేష్ వి.యన్.కుమార్ ఛాయాగ్రహణం, స్వరవీణాపాణి సంగీతం సమకూరుస్తారు. పలు కళారంగాల్లోని ప్రముఖులు ముఖ్యపాత్రల్లో నటించే ఈ చిత్రాన్ని 'నంది శ్రీహరి" సమర్పించనున్నారు. నంది శ్రీహరి 'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రంతో నిర్మాతగా మారారు. జగపతి బాబు, ఛార్మి కాంబినేషన్ లో రూపొందిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఇక జనార్దన మహర్షి గతంలో గోడ మీద పిల్లి చిత్రంతో దర్శకుడుగా మారారు.