Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలకృష్ణ ఎన్ని సార్లు అలా మాట్లాడలేదు.. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరే టార్గెట్, ఎందుకో మాకు తెలుసు!
శ్రీరెడ్డి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ టార్గెట్గా మారడం వెనుక ఉన్న కుట్రలు తనకు తెలుసు అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ అన్నారు. శ్రీరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారుతుండడంతో ఆయన టీవీ9 తో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ట్రోలింగ్ వలనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలకు ఆయన ధీటైన సమాధానం ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ ట్రోలింగ్ చేయరని అన్నారు. ట్రోలింగ్ చేస్తున్న వారంతా పవన్ కళ్యాణ్ అభిమానులే అని గ్యారెంటీ ఉందా అంటూ ప్రశ్నించారు. అందరి హీరోలకు అభిమానులు ఉన్నారని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్, అయన అభిమానులు మాత్రమే టార్గెట్గా మారడం వెనుక ఉన్న కుట్ర తెలుసు అని అన్నారు.
బాలకృష్ణ చాలా సార్లు అసభ్యంగా మాట్లాడారని కానీ ఆయన్ని ఎవరూ ప్రశ్నించలేదని శ్రీధర్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఉంటారు కనుక ప్రధానంగా ఉన్న పొలిటికల్ పార్టీలు భయపడుతున్నాయని అన్నారు.వారే వెనుక ఉంది ఇలాంటి వారందరిని నడిపిస్తున్నారని ఆరోపించారు.