Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హీరో ప్రభాస్ ఇంటి ముందు డాన్స్ చేసిన జపాన్ అభిమానులు!
'బాహుబలి' సినిమా తర్వాత జపాన్ దేశంలో కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు భారీగా అభిమానులు ఏర్పడిన సంగతి తెలిసిందే. 'బాహుబలి 2' సినిమా అక్కడ భారీ విజయం అందుకోవడానికి కారణం కూడా అదే. 2019 కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభాస్కు జపాన్ నుంచి అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. తనపై వారు చూపిన అభిమానానికి కృతజ్ఞతగా ప్రభాస్ కూడా వారికి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
కట్ చేస్తే... తాజాగా కొందరు అభిమానులు జపాన్ నుంచి నేరుగా హైదరాబాద్లోని ప్రభాస్ ఇంటికి వచ్చి సందడి చేశారు. యంగ్ రెబల్ స్టార్ ఇంటి ముందు నృత్యాలు చేస్తూ ఫోటోలు దిగారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' షూటింగ్ నిమిత్తం బయట ఉండటంతో వారు తమ అభిమాన నటుడిని కలవలేక పోయారు. బాహుబలి స్టార్ మీదవారు ఎంతలా అభిమానం పెంచుకున్నారో చెప్పడానికి తాజాగా సంఘటన ప్రతీకగా నిలుస్తుంది.
'సాహో' మూవీ విషయానికిస్తే.... సుజీత్ దర్శకత్వం వహిస్తుండా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్తో యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
'సాహో' బడ్జెట్లో ఎక్కువ శాతం(రూ. 90 కోట్లు) యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఖర్చు చేశారు. అబుదాబిలో 60 రోజుల పాటు చిత్రీకరించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలెట్ కాబోతోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా... నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.