Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జాతిరత్నాల కోసం రంగంలోకి రెబల్ స్టార్ ప్రభాస్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న టాలెంటెడ్ యువ హీరో నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా రాబోతున్న తదుపరి సినిమా జాతి రత్నాలు. నవీన్ తో పాటు స్టార్ కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కూడా సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ గట్టిగానే ఆలోచిస్తోంది.
సినిమాను వైజయంతి జాయింట్ ప్రొడక్షన్ స్వప్నా సినిమాస్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. పిట్టగొడ దర్శకుడు అనుదీప్ సినిమాకు దర్శకత్వం వహించగా రాధన్ మ్యూజిక్ అంధించాడు. ఇప్పటికే చిట్టి అనే సాంగ్ యూ ట్యూబ్ లో బాగా వైరల్ అయ్యింది. ఇక టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు అందరి చూపు ట్రైలర్ పైనే ఉంది.
సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారట. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ తో ఉన్న సాన్నిహిత్యం ద్వారా నాగ్ అశ్విన్ ఇటీవల ప్రభాస్ ను కలిసి జాతిరత్నాలు సినిమా గురించి చెప్పారట. ప్రభాస్ కూడా త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక సినిమాను ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు.