Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తెలుసా? జయ ప్రకాశ్రెడ్డి పాట పాడారు
హైదరాబాద్: తన నటనతో ప్రేక్షకులను అలరించే జయ ప్రకాశ్రెడ్డి తొలిసారి 'లచ్చిందేవికి ఓలెక్కుంది' చిత్రం కోసం ఓ పాట పాడారు. ఈ విషయాన్ని చిత్ర హీరో నవీన్చంద్ర తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలుపుతూ... ఓ ఫొటోను పోస్ట్ చేశారు.
#LOL Coming Soon
Posted by Naveen Chandra on 1 December 2015
నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠిలు జంటగా నటిస్తున్న చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ‘లోల్' అన్న టైటిల్తో ప్రచారం పొందుతోన్న ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో లోల్ టీమ్ డిసెంబర్ 11న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్కి సిద్ధమైంది. జగదీశ్ తలసిల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయిప్రసాద్ కామినేని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ...రాజమౌళి, కీరవాణి గారితో ఉండటం వల్ల నేను పర్ ఫెక్టుగా తయారయ్యాను. మనకు తెలియకుండా కొన్ని లక్షల కోట్లు లక్షల కోట్లు పడి ఉన్నాయి. అదేంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అందరికి నచ్చే విధంగా ఉంటుంది అన్నారు.
మయాఖ క్రియేషన్స్ బ్యానర్లో ప్రసాద్ కామినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్ణేష్ బాబు, మేల్కోటి, భద్రం, భాను తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డాన్స్: తార, కృష్ణారెడ్డి, జానీ, సన్నీ, ఫైట్స్: పి.సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఇ. మధుసూదనరావు, నిర్మాత: సాయి ప్రసాద్ కామినేని, రచన, దర్శకత్వం: జగదీష్ తలశిల.