జూ ఎన్టీఆర్ తర్వాత ‘జయప్రద’తో రామ్ చరణ్!
ఇటీవలే కొత్తగా లోకల్ టీవిలో ప్రారంభమైన, జయప్రద నేతత్వంలోని 'జయప్రదం" కార్యక్రమంలో తొలుత యన్టీఆర్ తన మనసులోని మాటలను చెప్పి తన అభిమానులకు ఎంతో ఆనందం కలిగించిన విషయం తెలిసిందే..మరి ఎన్టీఆర్ తర్వాత రాబోతున్న సెలబ్రిటీ కోసం అందరూ వేచి చూస్తున్న తరుణంలో ఈ సారి రాబోయేది మెగా ప్యామిలీ నుండి అని వార్తలు వినిపిస్తున్నాయి.
వైజయంతీ మూవీస్ అధినేత కూతురు స్వప్న దత్, యజమానిగా గల ఈ లోకల్ టీవి..ఈ మధ్య భారీగా లాస్ లో నడుస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ కార్యక్ర మం విజయవంతం కావడానికి దారులు వెతుకుతున్న సమయంలో అశ్వనీదత్ మదిలో నుండి వచ్చిన ఆలోచనే 'జయప్రదం". ఈ కార్యక్రమానికి టైటిల్ చూసి జయప్రద కూడా ఓప్పుకోవడంతో కార్యక్రమం సగం విజయవంతం సాధించినట్టుగా యాజమాన్యం భావిస్తున్నారట. ముఖ్యంగా ఈ ప్రొగ్రామ్ లో లెజండ్రీ డైరక్టర్స్, దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు, మరియు న్యూ జనరేషన్ నుండి వస్తున్న జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ వంటి స్టార్స్ తో ఇంటర్వ్యూ జరుగుతుంది. పరిశ్రమలోని వారంతా పరిచయస్తులే కావడంతో ..ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్ తర్వాత రాబోతున్న స్టార్ ఎవరనుకుంటున్నారు? మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జయప్రదతో ఎన్టీఆర్ లానే ఆడుకోవడానికి అన్ని విషయాలు చెప్పడానికి 'మగధీర" రెడీ అయ్యడట..మరి కార్యక్రమాన్ని చూసి మరింత ఎంజాయ్ కి మీరు సిద్దమనుకుంటాను.


Click it and Unblock the Notifications











