Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విజువల్ వండర్ సువర్ణసుందరి.. బాహుబలి రేంజ్లో..
టాలీవుడ్ లో కంటెంట్ బేస్డ్ సినిమాలకి విశేషమైన ఆదరణ చూరగొంటోంది. ఆ నేపధ్యంలో అద్భుతమైన కంటెంట్, అమేజింగ్ గ్రాఫిక్స్ తో ఎపిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం "సువర్ణసుందరి". పునర్జన్మల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రఖ్యాత నటీమణి జయప్రద కీలకపాత్ర పోషిస్తుండగా.. ఆమెకు తల్లిగా పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి విశేషమైన స్పందన లభించగా.. ఆగస్ట్ లో ఆడియోను విడుదల చేసి సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
బాహుబలి రేంజ్లో వీ ఎఫ్ ఎక్స్
"బాహుబలి, భజరంగీ భాయిజాన్" చిత్రాలకి వర్క్ చేసిన వి.ఎఫ్.ఎక్స్ టీం "సువర్ణసుందరి" చిత్రానికి కూడా వర్క్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకొంది. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు మా టీం అందరం కృషి చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
కృష్ణ దేవరాయల స్టోరీతో
సూర్య ఎంఎస్ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీ కృష్ణ దేవరాయల స్టోరీ ఆధారంగా తెరకెక్కనున్నట్టు సమాచారం. చరిత్ర భవిష్యత్ని వెంటాడుతోంది అనే ట్యాగ్ లైన్తో విజువల్ ఫీస్ట్గా మూవీ రూపొందుతుంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు.
సూర్య టేకింగ్ పక్కన పెడితే
సూర్య టేకింగ్ను పక్కనపెడితే.. ఎల్లుమహంతి సినిమాటోగ్రఫి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పుకొంటున్నారు. సాయి కార్తీక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనేది ఇన్సైడ్ టాక్. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొంటున్న సువర్ణ సుందరి సెప్టెంబర్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నది.
నటీనటులు, సాంకేతికవర్గం
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరీ, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ , రామ్, ఇంద్ర తదితరులు నటిస్తున్నారు. ఎడిటింగ్ ప్రవీణ్ పుడి, ఎస్ టీమ్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎంఎల్ లక్ష్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎల్లు మహంతి, సంగీతం: సాయి కార్తీక్, దర్శకత్వం: ఎం.ఎస్.ఎన్. సూర్య