Don't Miss!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జయసుధ భర్తను గాయపరిచిన యువకులు!
ఈ మధ్య హీరోలు ఫుల్ గా త్రాగి కారులను రాంగ్ రూట్ లో నడుపుతూ పోలీసులకు చిక్కుతున్న విషయం తెలిసిందే అయితే కొందరు యువకులు కారు రేస్ లు పెట్టుకుని సుమారు150కిమీ వేగంతో కారు నడుపుతుంటే ఓ పెద్ద మనిషి వారిని ఆపి అంత వద్దు ప్రాణాలకు ప్రమాదం అని చెప్పినా వారు వినలేదు. వారు వినకపోవడంతో వెంటనే ఆయన పోలీసులకు ఫోన్ చేయబోతే ఆ యువకులు ఆ పెద్దమనిషి పై చేయి చేసుకున్నారు ఏ స్థాయిలో అంటే చెవుల వెంట రక్తం వచ్చేలా కొట్టిపడేశారట. ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరనుకొంటున్నారా సికింద్రాబాద్ ఎమ్యేల్యే నటి జయసుధ భర్త నితిన్ కుమార్.
పబ్లిక్ ఇబ్బంది పడకూడదని ఆయన తీసుకున్న నిర్ణయం ఆయననే కొట్టి పడేసేలా చేసింది. దీంతో ఆగ్రహావేశానికి గురైన జయసుధ వెంటనే పోలీసు కేసు పెట్టి ఆ యువకులను పట్టుకోవాలని పోలీసులకు అర్డర్ జారీ చేసింది. మామూలుగా సామాన్యుడు ఎంత మెర పెట్టుకున్నా పలకని పోలీసులు ఎమ్మేల్యే కావడంతో జయసుధ అలా అర్డర్ వేసిందో లేదో గంటలో వారిని వెతికి పట్టుకుని అవినాష్ గోయల్, ఆదిత్య గోయల్, శశాంక్ గోయల్ లే ఈ పని చేశారని పోలీసుల దర్యాప్తులో తేలడంతో వారిని ఆమె ముందు నిలబెట్టారు.
దీని గురించి జయసుధ మాట్లాడుతూ 'నేను ఓ ఎమ్మేల్లేగా ఈ కేస్ ను మూవ్ చేయడం లేదు. మా వారిని చాలా తీవ్రంగా గాయపరిచారు. ఇలాంటి సంస్కతి మంచిది కాదు. వెంటనే పోలీసులు ఇలాంటివి జరగకుండా ఆపాలి అన్నారు. తన భర్త మీద దాడికి స్పందించినట్టుగా ఎమ్మేల్యేగా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చడానికి కూడా ఇంత కరెక్ట్ గా ఉంటే బావుణ్ణు అని ఆమె నియోజకవర్గంలోని ప్రజలు అనుకుంటున్నారు.