Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భవనంపై నుంచి దూకి నితిన్కపూర్ సూసైడ్.. గతంలో ఆత్మహత్యాయత్నం
ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య వెనుక అనుమానాస్పద అంశాలు లేవని ముంబై పోలీసులు పేర్కొంటున్నారు. నితిన్కపూర్ ఓ భవనం ఆరో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.
ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య వెనుక అనుమానాస్పద అంశాలు లేవని ముంబై పోలీసులు పేర్కొంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు నితిన్కపూర్ ఓ భవనం ఆరో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.
సోదరి ఇంట్లో నివాసం..
ముంబైలోని అంధేరీ వెస్ట్ జేపీ రోడ్లో ఉన్న సీ గ్లింప్స్ అపార్ట్మెంట్లోని సోదరి ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటినే నితిన్ కపూర్ తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు.
తలుపులు పగులకొట్టి.. బిల్డింగ్ మీద నుంచి
అపార్ట్మెంట్ పైన ఉన్న టెర్రస్ డోర్స్కు వేసిన తాళాన్ని పగులగొట్టి పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకి నితిన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
గతంలోనూ ఆత్మహత్యా ప్రయత్నం
జయసుధ భర్త, సినీ నిర్మాత నితిన్ కపూర్ మరణం వెనుక దిగ్బ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనూ కూడా నితిన్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. 18 ఏళ్లుగా సరైన విజయాలు లేకపోవడం ఆయన కుంగదీసినట్టు తెలుస్తున్నది.
ముంబై హాస్పిటల్ డిప్రెషన్కు చికిత్స
ముంబై పోలీసుల తెలిపిన ప్రకారం నితిన్ గతంలో కూడా ఓసారి ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం ఉంది. గత కొద్దికాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నారు. డిప్రెషన్ నుంచి బయటపడటానికి కోకిలాబెన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొంటున్నారు అని పోలీసులు వెల్లడించారు. నితిన్ మృతదేహానికి పంచనామా పూర్తి చేసి పోస్ట్ మార్టం కోసం తరలించారు.