Don't Miss!
- News మే 10న అక్షయ తృతీయ.. ఈ రాశులపై కనక వర్షం
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
జెడీ చక్రవర్తి నెక్స్ట్ చిత్రం డిటేల్స్
మనీ మనీ మోర్ మనీ చిత్రంతో రీసెంట్ గా ప్లాప్ ఇచ్చిన జెడీ చక్రవర్తి మరో చిత్రానికి అప్పుడే పని ప్రారంభించేసారు.ఆ చిత్రం టైటిల్ గాడ్పు. అది ఒక అర్బన్ ధ్రిల్లర్ అని చెప్తున్నాడు.సంక్రాతి కి విడుదల అయ్యే చిత్రం ప్రోమోలను మనీ మనీ మోర్ మనీ సినిమాతో పాటు విడుదల చేసాడు. ఈ చిత్రంలో జేడీ తానే కీ రోల్ చేస్తున్నాడు. అంతేగాక ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తున్నాడు.హర్రర్ సినిమాల్లో ఇదొక కొత్త తరహాలో ఉంటుందని చెప్తున్నాడు.ఇక హర్రర్ సినిమాలకు పెట్టింది పేరు రామ్ గోపాల్ వర్మ. ఆయన స్కుల్ లోంచి వచ్చిన జెడి కి మొదట నుంచి హర్రర్ సినిమాలంటే మక్కువే.అయితే మొదట సిద్దం,హోమం వంటి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.
అవి ఊహించిన విధంగా వర్కవుట్ కాలేదు.దాంతో ఆ తర్వాత మనీ మనీ మోర్ మనీ అంటే కామెడీ ఎత్తుకున్నాడు.హిందీలో తాను చేసిన దర్వజా బంద్ రఖో కి రీమేక్ గా వచ్చి న ఈ చిత్రం బ్రహ్మానందం వంటి స్టార్ కమిడియన్ ఉన్నా లాగలేకపోయింది.కధా బలం లేక చిత్రం చతికిలపడింది.ఇక ఆ సినిమాల్లా కాకుండా ఈ హర్రర్ తనకు మంచి టెక్నిషియన్ గా పేరుని,నిర్మాతగా డబ్బుని తెచ్చిపెడుతుందని భావిస్తున్నాడు. భయపెట్టే కధాంసమే ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అని నమ్మి దిగుతున్నాడు.అయితే హిందిలో ఉన్నట్లుగా తెలుగులో హర్రర్ కి మార్కెట్ లేదనే విషయం గతంలో చాలా సార్లు ప్రూవైంది.వర్మ రూపొందించిన హర్రర్ చిత్రాలు కూడా తెలుగులో వర్కవుట్ కాలేదు.మరి జెడీ రూపొందించే ఈ హర్రర్ ఏ మేరకు ప్రేక్షకుడుని అలరించనుందో చూడాలి.