జెడి చక్రవర్తి ఇంకోటి మొదలెట్టాడు

శ్రీకాంత్ మాట్లాడుతూ ''నేనూ, జేడీ కలిసి నటించిన 'వన్ బై టు', 'ఎగిరేపావురమా' చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాయి. మేమిద్దరం కలిసి చాన్నాళ్ల తరవాత ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది. రెండున్నర గంటలు సరదాసరదాగా సాగే కథ ఇది'' అన్నారు. ''ఓ సందర్భంలో 'నీ దర్శకత్వంలో నేను నటిస్తా' అన్నాడు శ్రీకాంత్. అదిప్పుడు నిజం కావడం ఆనందంగా ఉంది. తను కథ కూడా వినకుండా చిత్రాన్ని అంగీకరించాడు. కథంతా ఆయన పాత్రపైనే నడుస్తుంది. ఎవరు ఎవరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు? ఎందుకు చెప్పారు అనేది ఇందులో కీలకాంశం అన్నారు'' దర్శకుడు. ఈ చిత్రంలో చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రదీప్రావత్, కృష్ణ భగవాన్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రధారులు. మాటలు: కృష్ణమోహన్ చల్లా, ఛాయాగ్రహణం: జి.శివకుమార్, సంగీతం: హేమచంద్ర.


Click it and Unblock the Notifications











