Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నితిన్ హీరోగా జెడి చక్రవర్తి దర్శకత్వంలో...
అడవి చిత్రంతో రామ్ గోపాల్ వర్మ క్యాంప్ లో ప్రవేశించిన నితిన్..వర్మ క్యాంప్ లోనే కొనసాగుతున్నారు. 'హోమం', 'సిద్ధం' లతో దర్శకుడుగా మారిన నట దర్శకుడు జెడి చక్రవర్తి దర్శకత్వంలో నితిన్ నటించనున్నారు. రెండు సార్లు పోలీస్ స్టోరీలు చేసిన జెడీ ఈసారి ప్రేమకథని ఎంచుకున్నారు. సార్థక్ మూవీస్ పతాకంపై ప్రశాంత్ బుర్రా నిర్మిస్తారు. ఆయన మాట్లాడుతూ "మా సంస్థ ఇటీవలే 'ఫూంక్ 2'ని నిర్మించింది. దీన్నే తెలుగులో 'ఆవహం'గా అనువదించాం. ఇప్పుడు తెలుగులో నేరుగా ఓ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. జేడీ చెప్పిక కథ ఎంతో బావుంది. దానికి నితిన్ అయితేనే న్యాయం చేస్తారు. సాంకేతికంగా ఉన్నత విలువలతో నిర్మిస్తాం. జూన్ మొదటి వారంలో చిత్రీకరణ మొదలవుతుంద"న్నారు. "మూడు దేశాల్లో జరిగే వినూత్న ప్రేమకథ ఇది. కథలో ఎక్కువ భాగం అమెరికాలో జరుగుతుంది. సంగీతానికి ప్రాధాన్యం ఇస్తామ"న్నారు జేడీ చక్రవర్తి. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి అని చెప్పారు. వరస ప్లాపుల్లో దూసుకుపోయే నితిన్ ఈ చిత్రంతోనన్నా హిట్ కొడతాడేమో చూడాలి.