Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నితిన్ హీరోగా జెడి చక్రవర్తి దర్శకత్వంలో...
అడవి చిత్రంతో రామ్ గోపాల్ వర్మ క్యాంప్ లో ప్రవేశించిన నితిన్..వర్మ క్యాంప్ లోనే కొనసాగుతున్నారు. 'హోమం', 'సిద్ధం' లతో దర్శకుడుగా మారిన నట దర్శకుడు జెడి చక్రవర్తి దర్శకత్వంలో నితిన్ నటించనున్నారు. రెండు సార్లు పోలీస్ స్టోరీలు చేసిన జెడీ ఈసారి ప్రేమకథని ఎంచుకున్నారు. సార్థక్ మూవీస్ పతాకంపై ప్రశాంత్ బుర్రా నిర్మిస్తారు. ఆయన మాట్లాడుతూ "మా సంస్థ ఇటీవలే 'ఫూంక్ 2'ని నిర్మించింది. దీన్నే తెలుగులో 'ఆవహం'గా అనువదించాం. ఇప్పుడు తెలుగులో నేరుగా ఓ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. జేడీ చెప్పిక కథ ఎంతో బావుంది. దానికి నితిన్ అయితేనే న్యాయం చేస్తారు. సాంకేతికంగా ఉన్నత విలువలతో నిర్మిస్తాం. జూన్ మొదటి వారంలో చిత్రీకరణ మొదలవుతుంద"న్నారు. "మూడు దేశాల్లో జరిగే వినూత్న ప్రేమకథ ఇది. కథలో ఎక్కువ భాగం అమెరికాలో జరుగుతుంది. సంగీతానికి ప్రాధాన్యం ఇస్తామ"న్నారు జేడీ చక్రవర్తి. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి అని చెప్పారు. వరస ప్లాపుల్లో దూసుకుపోయే నితిన్ ఈ చిత్రంతోనన్నా హిట్ కొడతాడేమో చూడాలి.