Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాపై ప్రముఖ హీరో అత్యాచారం.. ఆ బాధతోనే తల్లిదండ్రుల మరణం..
Recommended Video
ప్రముఖ నటుడు జితేంద్ర తనపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఓ బాధితురాలు సిద్ధమవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన బాధితురాలు జితేంద్రకు బంధువులు కావడం ఈ వివాదంలో ట్విస్ట్గా మారింది. వివరాల్లోకి వెళితే..
షూటింగ్ చూడాలని వెళితే
షూటింగ్ చూడాలని నా తండ్రిని కోరడంతో ఆయన జితేంద్ర షూటింగ్కు తీసుకెళ్లాడు. జితేంద్ర నాకు మేనమామ అవుతారు. అప్పుడు నా వయసు 18 ఏళ్లు, ఆయనకు 28 ఏళ్లు. నాకు ఆయనకు పదేళ్ల తేడా ఉంది.
జితేంద్ర లైంగిక దాడి
షూటింగ్ చూడటానికి వెళ్లిన సందర్భంలో నాపై జితేంద్ర లైంగిక దాడి చేశాడు. ఆ సమయంలో నా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో నేను ధైర్యంగా ఈ విషయాన్ని చెప్పగలుతున్నాను.
తల్లిదండ్రులు గుండె పగిలి
జితేంద్ర చేసిన నిర్వాకంతో నా తల్లిదండ్రులు గుండె పగిలి చనిపోయారు. నా జరిగిన అన్యాయానికి వారు తీవ్రంగా బాధపడ్డారు. ఆ బాధతోనే వాళ్లు మరణించారు.
పరిస్థితులు మారిన నేపథ్యంలో
లైంగిక దాడి విషయంలో మహిళా సంఘాలు ముందుకొస్తుండటం నాలో ధైర్యాన్ని నింపింది. సోషల్ మీడియా అడ్వాంటేజ్ కారణంగా #MeToo అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం నాకు న్యాయం జరుగుతుందన్న కొంత విశ్వాసం పెరిగింది.
సొంతంగా నిర్ణయాలు తీసుకొనే
ఇప్పుడు నేను స్వంతంగా నిర్ణయాలు తీసుకొనే మహిళగా మారాను. నాపై లైంగిక దాడికి నేను చాలా కుంగిపోయాను. మానసిక క్షోభను అనుభవించాను. అప్పట్లో జితేంద్రకు రాజకీయ సంబంధాలు ఉన్నాయని భయపడ్డాను అని బాధితురాలు తెలిపారు.
ఐడెంటిటిని బయటపెట్టవద్దు
తాను ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నా ఐడెంటిని బయట పెట్టకుండా ఉండాలని మీడియాకు వెల్లడించింది. నా ఫిర్యాదు నేపథ్యంలో చట్టం తన పని తాను చేసుకెళ్లితే నాకు న్యాయం జరుగుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు