Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వి.వి.వినాయిక్ చేతుల మీదగా 'మాస్క్'
ఆడియో విడుదల సందర్భంగా హీరో జీవా మాట్లాడుతూ ''సూపర్మేన్ తరహా పాత్రను పోషించే అవకాశం ఈ సినిమాతో నాకు దొరకడం ఆనందంగా ఉంది. పూర్తిగా మన దక్షిణ భారత వాతావరణానికి తగ్గట్టుగా సాగుతుంది. ఈ సినిమా కోసం కిలోల కొద్దీ బరువుండే దుస్తుల్ని ధరించి నటించాను. కథ, పాత్రలకు తగ్గట్టుగా కొన్ని యుద్ధ విద్యల్ని నేర్చుకొన్నాను. నటుడిగా భిన్నమైన అనుభూతిని మిగిల్చింది. దర్శకుడు మిస్కిన్ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. 'రంగం'లాగే ఈ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది''అన్నారు.
వినాయక్ మాట్లాడుతూ ''నాకు బాగా ఇష్టమైన దర్శకుల్లో మిస్కిన్ ఒకరు. సున్నితమైన కథాంశాల్ని చాలా బాగా తెరకెక్కిస్తారు. 'మాస్క్' ప్రచార చిత్రాల్ని చూడగానే సినిమాపై ఆసక్తి కలిగింది. జీవాకి ఈ సినిమాతో మరొక మంచి విజయం చేకూరాలి''అని ఆకాంక్షించారు. నిర్మాతల్లో ఒకరైన యన్.విపసాద్ మాట్లాడుతూ ''యు.టి.వి.సంస్థ మూడు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించింది. 'రంగం'తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జీవా ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించాడు. ఇటీవలే స్విట్జర్లాండ్లో రెండు పాటల చిత్రీకరణతో షూటింగ్ కార్యక్షికమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది' అన్నారు.
ఓ సాధారణ వ్యక్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సూపర్మేన్గా ఎలా అవతరించడన్న పాయింట్ తో నడిచే చిత్రం ఇది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నడుస్తుంది. జీవా సూపర్హీరో పాత్రలో కనిపిస్తారు. మెగా సూపర్గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పణలో యన్.విపసాద్-పారస్జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్.శ్యామ్ప్రసాద్రెడ్డి, నాజర్, అలీ, దేవిప్రసాద్, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.