Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ‘మాస్క్’చేశాం
హైదరాబాద్ : నాకు తెలిసిన సూపర్హీరోలు అంటే ఎన్టీఆర్, ఎమ్జీఆర్. వారి సినిమాల నే 'మాస్క్'లో ఆదర్శంగా తీసుకోవడం జరిగింది అని చెప్పారు మిస్కిన్ దర్శకత్వంలో జీవా తమిళంలో నటించిన చిత్రం ' ముగమూడి'. ఈ సినిమాను 'మాస్క్' పేరుతో మెగా సూపర్గుడ్ ఫిల్మ్ ప్రై.లిమిటెడ్ ద్వారా నిర్మాత ఆర్బీ చౌదరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 31న 'మాస్క్' విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవా పై విధంగా స్పందించారు.
అలాగే ....'మాస్క్'లో సూపర్హీరోగా చేశాను. అయితే ఆ పాత్రకు మానవాతీత శక్తులేం ఉండవు. తనలో అంతర్గతంగా దాగున్న ఓ మానవశక్తే ఆ పాత్రను సూపర్ హీరోను చేస్తుంది. గతంలో వచ్చిన కొన్ని సూపర్హీరోల చిత్రాలను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమాను మలిచామని కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. వాటికీ 'మాస్క్'కీ సంబంధం ఉండదు. ఇది పూర్తి భిన్నమైన నేపథ్యం. కనిపించడానికి సూపర్హీరో సినిమాలా అనిపించినా... మన దేశానికి చెందిన భావోద్వేగాలన్నీ ఇందులో మెండుగా ఉంటాయి అన్నారు.
ఇక చాలా ఇంట్రిస్టింగ్ నేపథ్యంతో ఓ అద్భుతంగా మిస్కిన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 90 శాతం రాత్రి సమయంలోనే ఈ కథ నడుస్తుంది. హాంకాంగ్లో పేరిన్నికగన్న ఫైట్ మాస్టర్స్ ఈ సినిమాకు పనిచేశాను. ఇందులో పోరాటాలు అద్భుతంగా ఉంటాయి. కుంగ్ఫూలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అలాగే సంగీత దర్శకుడు కె పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. టోటల్గా 'మాస్క్' ఓ యూనివర్సల్ ఫిలిం అని జీవా తెలిపారు.
యూటీవీవారు తమిళంలో నిర్మించిన ఈ చిత్రం అనువాద హక్కులను ఎంతో పోటీ మీద దక్కించుకున్నామని, ఇందులో యాక్షన్ సీన్స్ కొత్తగా ఉంటాయని పారాస్జైన్ చెప్పారు. గ్లామర్తో పాటు అభినయానికి కూడా ఆస్కారమున్న పాత్రను ఇందులో పోషించానని కథానాయిక పూజా హెగ్డే చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: కె., కెమెరా: సత్య, ఎడిటింగ్: గౌగిన్, నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్జైన్, సమర్పణ: ఆర్.బి.చౌదరి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మిస్కిన్.