Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
శనివారం వస్తున్న 'జోష్'
నాగచైతన్య కథానాయకుడుగా వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'జోష్' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈనెల 5వ తేదీ ఉదయం ఆటతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత ఈనెల 3న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసినప్పటికీ 2వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో చిత్రం విడుదలను వాయిదా వేయాలని దిల్ రాజు, నాగార్జున నిర్ణయించారు. రెండు రోజుల స్వచ్ఛంద బంద్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈనెల 5వ తేదీని సినిమాను విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్ లో సైతం ఇదేరోజు విడుదలవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రింట్లతో 500 థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది. రాష్ట్రేతర ప్రాంతాలు, ఓవర్సీస్ లో విడుదలకు దిల్ రాజు 100 ప్రింట్లు సిద్ధం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్ కతా వంటి మెట్రోపాలిటన్స్ లోని మల్టీప్లెక్స్ లలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అక్కినేని మూడోతరం వారసుడుగా నాగచైతన్య హీరోగా పరిచయమవుతుండటం, ఆయనకు జోడిగా 80వ దశకంలో ఓ వెలుగువెలిగిన నటి రాధ కుమార్తె కార్తీక తెలుగుతెరకు పరిచయం అవుతుండటం ప్రేక్షకులలో ఈ చిత్రంపై మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 9వ చిత్రమిది. కాలేజీ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందింది. ప్రకాష్ రాజ్, జె.డి.చక్రవర్తి, బ్రహ్మానందం, సితార, ఆనంద్, సూర్య తదితరులు నటించారు. స్క్రీన్ ప్లే వాసువర్మ అందించిన ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందించారు.