లేడీ జర్నలిస్టుకు నరకం చూపిన హీరో ఫ్యాన్స్!
జర్నలిస్టుకు హీరో అభిమానులు నరకం చూపారు. విజయ్ సినిమాపై కామెంట్ చేయడమే ఇందుకు కారణం.
తమ హీరో సినిమాపై కామెంట్ చేసిన ఓ లేడీ జర్నలిస్టుకు తమిళ స్టార్ విజయ్ అభిమానులు నరకం చూపారు. విజయ్ నటించిన సినిమా గురించి ఆమె ఓ ట్వీట్ చేయగా.... ఆగ్రహానికి గురైన అభిమానులు వేల సంఖ్యలో స్పందించారు.
ధన్య రాజేంద్రన్ అనే జర్నలిస్ట్ ఇటీవల షారుక్ నటించిన 'జబ్ హ్యారీ మెట్ సెజల్' సినిమాకి వెళ్లింది. సినిమా చూశాక ఈ సినిమా గురించి తన అభిప్రాయన్ని వెల్లడించింది. ఈ క్రమంలో విజయ్ నటించిన సినిమా పేరు ప్రస్తావించడంతో ఆమె ఇబ్బందుల్లో పడింది.

ఆ కామెంటే కారణం
షారుక్ సినిమా మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ... ఈ సినిమా విజయ్ నటించిన ‘సురా' కంటే చెత్తగా ఉందని ట్వీట్ చేసింది. దీంతో విజయ్ అభిమానులు ఆమెను టార్గెట్ చేశారు.
Recommended Video


నరకం చూపారు
తమ హీరో సినిమా గురించి కామెంట్ చేయడంతో ఆ జర్నలిస్టుకు నరకం చూపారు.మూడురోజుల పాటు వరుస ట్వీట్లతో ఆమెను ఇబ్బంది పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు 63 వేల ట్వీట్లు చేశారు.

పోలీస్ కంప్లైట్
వేలాది ట్వీట్లతో తనపై దాడి మొదలవ్వడంతో ధన్య రాజేంద్రన్ పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు ఐటి యాక్ట్, ఇండీసెంట్ రిప్రజంటేషన్
ఆఫ్ ఉమెన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అనుమానంతో నలుగురు వ్యక్తులను విచారించినట్లు సమాచారం.

విజయ్
అయితే ఈ సంఘటనపై విజయ్ ఇంకా స్పందించలేదు. ఈ విషయమై ప్రశ్నించేందుకు మీడియా వారు ప్రయత్నించగా ఆయన ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











