twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలో తమని తాగుబోతులుగా చూపెట్టారంటూ జర్నలిస్టుల కేసు

    By Srikanya
    |

    తాము త్రాగుతామని, బూతులు మాట్లాడతామని చిత్రంలో చూపెట్టడం ఎంతవరకూ భావ్యం, ఇది తమను కించపరిచినట్లేనంటున్నారు జర్నలిస్టులు. రీసెంట్ గా రిలీజైన నో వన్ కిల్డ్ జెస్సికా చిత్రంలో రాణీ ముఖర్జి జర్నలిస్ట్‌గా నటించారు. ఈ పాత్ర కోపం వచ్చినప్పుడు ఆ ఎమోషన్లో బూతులు కూడా మాట్లాడుతుంది. ఈ విషయం పట్ల కొంతమంది జర్నలిస్ట్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అలాగే ఆమె ఓ చోట మద్యం తీసుకుంటుంది. ఇలా సినిమాలో రాణి బూతులు మాట్లాడటం, మద్యం పుచ్చుకోవడం జర్నలిస్టులను కించపరిచినట్లేనని, జర్నలిస్టులు ఈ విధంగానే ఉంటారనే అభిప్రాయాన్ని ఏర్పరుస్తోందని, అందుకని రాణిపై చర్య తీసుకోవాలని కేసు పెట్టారు.

    ఈ చిత్రానికి రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఆయనపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ సినిమాలో విద్యాబాలన్ కూడా నటించారు.ఇక ఈ చిత్రం 1999 సంవత్సరం ఏప్రిల్ 29న ఢల్లీ నగర శివారుల్లోని ఓ రిచ్ పబ్ లోని ఓ హత్య ఆధారంగా తీయబడింది. ఆ పబ్‌లో జరుగుతున్న సోషలైట్ సెలిబ్రిటీ పార్టీకి హర్యానా మంత్రి వినోద్‌శర్మ కుమారుడు మనుశర్మ వచ్చాడు. ఆ బార్‌లో బార్ టెండర్‌గా పనిచేస్తున్న మోడల్-జెస్సికాలాల్! మను అప్పటికే పీకలవరకు తాగాడు. మరో పెగ్ అడిగాడు. జెస్సికా వారించింది. మను తన దగ్గరున్న రివాల్వర్ తీసి జెస్సికాని కాల్చాడు. జెస్సికా అక్కడికక్కడే మరణించింది.అదే ఇతివృత్తంతో ఈ చిత్రం తీసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X