twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కథ లేకున్నా..విషయం ఉన్న ‘జర్నీ’ (రేపు విడుదల)

    By Bojja Kumar
    |

    గజనీ, సెవెన్త్ సెన్స్ చిత్రాలను రూపొందిన మురగాస్ నిర్మించిన సినిమా జర్నీ. ఈ సినిమా రేపు(డిసెంబర్ 16)న విడుదల కాబోతోంది. తమిళంలో 'ఎంగేయుమ్ ఎప్పొదుమ్' పేరుతో రూపొందిన ఈ సినిమా అక్కడ త్వరలో వందరోజులు పూర్తిచేసుకోబోతుంది. ఈ చిత్రాన్ని యస్.కె.పిక్చర్స్ పతాకంపై నిర్మాత సురేష్ కొండేటి 'జర్నీ' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

    ఈ సినిమా గురించి విషయాలను ఆ చిత్ర హీరో శర్వానంద్ వివరిస్తూ...''మనం రోజువారి జీవితంలో ఎన్నో ప్రమాద వార్తల్ని వింటుంటాం. కానీ ఆ ప్రమాదాల వెనక వున్న కారణాలు...అవి జీవితాలపై ఎలాంటి పరిణామాల్ని చూపుతాయో ఎప్పుడూ ఆలోచించం. అలాంటి అంశాలన్నింటినీ హృద్యంగా చర్చిస్తుందీ చిత్రం. ఇందులో కథగా ఏమీ వుండదు. రెండు ప్రేమ జంటల భావోద్వేగభరిత ప్రయాణమిది. నాయకానాయికలకు మాత్రమే కాకుండా ప్రతీ పాత్రకు ప్రాధాన్యత వుంటుంది. ప్రతి సన్నివేశం యథార్థానికి దగ్గరగా చాలా సహజంగా వుంటుంది'' అచి చెప్పారు. నాలుగు పాటలు, రెండు ఫైట్లతో సినిమా చేయడం నాకు ఇష్టం వుండదు. సినిమాలో నా పాత్ర కంటే మొత్తంగా సినిమా కథేంటనే విషయానికే నేను ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాని శర్వానంద్ వెల్లడించారు.

    English summary
    Journey is releasing on 16th December and the rights have been bought by SK Pictures. It has Sharwanand, Jai, Anjali and Ananya playing the lead roles. Directed by M. Saravanan in Tamil titled 'Engeyum Eppothum'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X