Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'అదుర్స్' విందుభోజనం లాంటి సినిమా: జూ ఎన్టీఆర్
"నా అభిమానులకు విందుభోజనం లాంటి సినిమా అదుర్స్. రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమాలో చేశాను. ఇప్పటి వరకూ వచ్చిన నా చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమా ఇది. వినయ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా మలిచాడు. నా ఇమేజ్కి తగినట్టుగా దేవిశ్రీ చక్కని సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా తప్పక ప్రేక్షకులను అలరిస్తుందని నా నమ్మకం' అని ఎన్టీఆర్ తన తాజా చిత్రం అదుర్స్ గురించి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆధ్రావాలా తర్వాత ఆయన రెండు పాత్రల్లో కనిపిస్తున్న చిత్రం ఇదే. ఆ రెండు పాత్రల్లో ఒకటి భ్రాహ్మణ పాత్ర,మరొకటి డాన్ పాత్ర అని తెలుస్తోంది.
అలాగే దర్శకుడు వివివినాయిక్ మాట్లాడుతూ.."ఎన్టీఆర్ నటనలో విభిన్న కోణాల్ని 'అదుర్స్'లో చూడొచ్చు. ఇందులో ఆయన రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒక పాత్రను ఎవరైనా చేయొచ్చేమోగానీ, రెండవ పాత్ర మాత్రం ఎన్టీఆర్ తప్ప తెలుగులో ఎవ్వరూ చేయలేరు. ఇందులో కొత్త ఎన్టీఆర్ని చూస్తారు. ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబినేషన్లో కామెడీ సీన్స్ కడుపుబ్బ నవ్విస్తాయి. నిర్మాతలు రాజీ పడకుండా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్తో నాకిది హ్యాట్రిక్ హిట్ అవుతుంది' అని దర్శకుడు వీవీవినాయక్ అన్నారు. వివి వినాయిక్ తనదైన స్టైల్ని పక్కనపెట్టి ఆద్యంతం కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించారని సమాచారం.
అలాగే ఎన్టీఆర్, వినాయిక్. కాంబినేషన్లో ఇది మూడవ చిత్రం కావడం మరో విశేషం.అలాగే ఓ పాటలో వినాయిక్ డాన్స్ చేస్తూ కనపడుతున్నాడు. ఈ చిత్రంలో తొలిసారిగా నయనతార, షీలా అతనికి జోడీగా కనిపించనున్నారు. వీటికి తోడు భిళ్లాతో తొలిసారిగా బికినీ వేసిన నయనతార ఈ చిత్రంలోనూ మరోసారి బికినీలో కనిపించి కనువిందు చేయనుంది. ఇవే కాక అందాల భామ ఛార్మీ ఓ ఐటం సాంగ్ లో తన అందచందాలు ఒలకపోయనుంది.
దేవీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కోనవెంకట్ కథ-మాటలు అందించారు. ఇందులో మహేష్ ముంజ్రేకర్ విలన్ గా చేసారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఆనంద సాయి కళాదర్శకత్వం వహిస్తున్నారు. కొడాలి నాని చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.