Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అదుర్స్ రిలీజయ్యాక అందరూ..జూ ఎన్టీఆర్
వినాయిక్ తో నేను చేస్తున్న మూడో చిత్రం ఇది. ఆది చిత్రం ఫ్యాక్షన్ నేపద్యంలో చేస్తే, సాంబ సినిమా ఎడ్యుకేషన్ సిస్టం మీద చేసాం. అయితే ఈ మూడో చిత్రం మాత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైనర్. ఈ చిత్రం రిలీజయ్యాక నిర్మాత,పంఫణీదారులు..అందరూ హ్యాపీగా ఫీలీవుతారు..అలాగే అదుర్స్ టైటిల్ మా స్టోరీ లైన్ కు కరెక్టుగా సరిపోతుంది అంటూ జూ.ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్,వివి వినాయిక్ కాంబినేషన్లో రెడీ అవుతున్న అదుర్స్ చిత్రం లోగో ఆవిష్కరణ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆదివారం సాయింత్రం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.
డైరక్టర్ వివి వినాయిక్ మాట్లాడుతూ..మేం మొదట ఈ టైటిల్ గురించి ఆలోచించలేదు..కానీ ప్రతీ ఒక్కరూ ఎన్టీఆర్ సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ అంటున్నారు. దాంతో ఫైనల్ గా ఈ అదుర్స్ నే ఓకే చేసారం. అంతేగాక ఈ ఎంటర్టైన్ మెంట్ సినిమాకు ఈ టైటిల్ జస్టిఫై అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం మా మూడో చిత్రం కావటంతో రెండు, మూడు స్క్రిప్టులు పరిశీలించి బెస్ట్ అనుకున్నాకే రంగంలోకి దిగాం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చాలా హ్యాండ్ సమ్ గానే కాక డ్యాషింగ్ గా కనపడతారు. మంచి కామిడీ ఈ స్క్రిప్టులో వర్కవుట్ అయ్యింది. బ్రహ్మానందంతో వచ్చే ఎపిసోడ్స్ హిలేరియస్ గా ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో హైలెట్ అవుతుంది అన్నారు.
కొడాలి నాని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. మరో నిర్మాత నల్లమలుపు బుజ్జి పర్యవేక్షిస్తున్నారు. ఆడియో డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అవుతుంది. సినిమాని డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎన్టీఆర్, వినాయిక్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, బ్రహ్మానందం, బుజ్జి, ఎడిటర్ గౌతంరాజు తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్స్ గా నయనతార, షీలా ఈ చిత్రంలో చేస్తున్నారు.