ఎన్టీఆర్ 'బృందావనం'కు గుమ్మడికాయ కొట్టేసారు
ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న బృందావనం చిత్రం షూటింగ్ నిన్న(మంగళవారం) సాయింత్రంతో పూర్తయింది. ఈ సందర్భంగా గుమ్మడికాయ కొట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్ళటానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇక నిన్న ఎన్టీఆర్, సమంత, ప్రకాష్ రాజ్ ల కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ప్యాచ్ వర్క్ తో సహా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని సమాచారం. మొన్న ఆదివారం విడుదలైన ఆడియో అంతటా మంచి క్రేజ్ తెచ్చుకుంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఛోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫర్ గా చేసారు. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
More from Filmibeat
జూ ఎన్టీఆర్ బృందావనం కాజల్ సమంత వంశీ పైడిపల్లి దిల్ రాజు తమన్ jr ntr kajal samantha brindavanam vamsy paidipally dil raju


Click it and Unblock the Notifications











