బాచ్ పల్లిలో జూ ఎన్టీఆర్ ఇల్లు కరీదు రెండున్నర కోట్లు..!
జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'దిల్" రాజు నిర్మిస్తున్న చిత్రం 'బృందావనం". కాజల్, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం కోసం నాలుగెకరాల్లో హైదరాబాద్ లోని బాచ్ పల్లిలో ఓ ఇంటి సెట్ వేశారు. బహుశా సినిమాలో ఇది ఎన్టీఆర్ ఇల్లు అయ్యుంటుంది. మూడెకరాల విస్తీర్ణంలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో ఈ ఇంటి సెట్ నిర్మాణం జరిగిందట. మిగతా ఒక ఎకరంలో కృత్రిమ గార్డెన్ తయారు చేశారట. ఈ సెట్ కు అయిన ఖరీదు రెండున్నర కోట్లు అని సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన 60శాతం షూటింగ్ ని ఇందులో చేయడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు.
More from Filmibeat
జూ ఎన్టీఆర్ కాజల్ సమంత బృందావనం దిల్ రాజు వంశీ పైడిపల్లి jr ntr kajal samantha brindavanam dil raju vamsi paidipalli


Click it and Unblock the Notifications











