ఎన్టీఆర్ ‘దమ్ము’: శృతి ఔట్- కాజల్ ఇన్
బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'దమ్ము"లో తొలుత శృతి హాసన్ ఎంపికవగా...10 రోజుల షూటింగ్ తర్వాత డేట్లు అడ్జెస్ట్ కావడం లేదనే సాకుతో శృతి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం శృతి వదులుకున్న స్థానాన్ని కాజల్ దక్కించుకుంది.
ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావడంతో హీరోయిన్ ఎంపిక ఆలస్యం అవుతుందని భావించిన బోయపాటి వెంటనే కాజల్ కు ఫోన్ చేయగా...ఆమె అందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తూంది. ఇది వరకు బృందావనం సినిమాలో తనకు తగిన జోడీగా నటించిన అనుభవం ఉండటంతో జూనియర్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోయపాటి తెలిపారు. బోయపాటి నిర్ణయంపై నిర్మాత అలెగ్జాండర్ వల్లభ కూడా సంతోషంగా ఉన్నారట. కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్ బ్యానరపై రూపొందుతుండగా, కె.ఎస్.రామారావు సమర్పకులు. బాలయ్య సింహా సినిమాతో భారీ హిట్ సాధించిన బోయపాటి...జూనియర్ కూడా అలాంటి బ్రేక్ ఇవ్వడానికి చాలా కసరత్తే చేస్తున్నాడు దమ్ము సినిమా కోసం. ఇక పోతే...ఇదికాక కాజల్ ప్రస్తుం మహేష్ బాబు సరసన బిజినెస్ మ్యాన్ సినిమాలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











