Don't Miss!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- News వివేకా హత్యపై మాట్లాడొద్దు- కడప కోర్టు సంచలన ఆదేశాలు..!
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జూ ఎన్టీఆర్ పై పేలుతున్న జోకులు...?!
కరెంటు తీగ కూడా నాలాగే సన్నాగా ఉంటది..కానీ ముట్టుకుంటే దానమ్మా షాక్ కొట్టేస్తది...!" అనే డైలాగ్ ని సినిమాలో చెప్పడమే కాకుండా, దానిని ఫస్ట్ ట్రెయిలర్ లో రిలీజ్ చేసి, ఆ తర్వాత దానినే ఆడియో వేడుకలోనూ చెప్పిన జూ ఎన్టీఆర్ ని చూస్తే..ఆ డైలాగ్ అంటే అతనెంత ముచ్చటపడిపోతున్నాడో అర్థమవుతోంది. తనని కరెంటు తీగలా సన్నాగా ఉన్నావని అనేసరికి జూ ఎన్టీఆర్ ఉబ్బితబ్బిబైపోయాడేమో..ఏదో సన్నజాజి తీగలా ఉన్నావని అంటే అమ్మాయి మురిసిపోయినట్టు ఎన్టీఆర్ మురిసిపోతున్నాడు జూ ఎన్టీఆర్.
అయితే ఎన్టీఆర్ వాలకం చూసి...ఆ డైలాగ్ విని...'ఏ కరెంట్ తీగ బాబూ..ఇంత 'సన్నగా" ఉండేది అంటూ జనం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ డైలాగొకటి చాలదన్నట్టు రాజమౌళి మళ్లీ మళ్లీ బతిమాలుకుంటూ ఎన్టీఆర్ తన స్థాయిని దిగజార్చుకుని బతిమాలడం బాగోలేదని, జూ ఎన్టీఆర్ తో చేసే కథ సిద్దమైతే అతనే వస్తాడు కదా అని ఎన్టీఆర్ హితులు చెబుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో తమన్నా, జూ ఎన్టీఆర్ మద్య క్లైమాక్స్ సీన్స్ కొన్ని ను చిత్రీకరిస్తున్నారు. ఊసరవెల్లి" షూటింగ్ దాదాపు పూర్తి అయ్యీ, అక్టోబర్ 6 న విడుదల అయ్యేందుకు త్వర త్వరగా సన్నాహాలు సిద్ద చేసుకోంటోంది.