twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లిష్టమైన పరిస్థితులో సాహసంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ...

    By Sindhu
    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 25రోజులు హైదరాబాద్ లో కనిపించడు. ఎందుకంటే 'శక్తి" షూటింగ్ కోసం లఢక్, కాశ్మీర్, హరిద్వార్ వెళుతున్నాడు. 25 రోజులు పాటు ఈ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఎన్టీఆర్, మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న 'శక్తి' చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో సెకెండ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ధర్డ్ డ్యూల్ ని జమ్ము కాశ్మీర్ లోని లఢక్ ప్రాంతంలో షూట్ చేయనున్నారు, కొద్ది నెలలుగా మంచు తో బ్లాక్ అయిన ఆ ప్రాతం ఇప్పటికీ వాతావరణం అనువుగా అనుకూలించలేదని సమాచారం. అయినా కూడా శక్తి యూటనిట్ సభ్యులంతా వెళ్లడానికి సమయాత్తం అవుతున్నారు. తెలిసిన వారు కొంతమంది అక్కడి వాతావరణంలో షూటింగ్ చేయడం అంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సలహఆలిస్తున్నారట.

    ఈ విషయం తెలిసినప్పటికీ జూ ఎన్టీఆర్ సాహసోపేతంగా అక్కడికి వెళుతున్నాడు. క్లిష్టమైన వాతావరణంలో 'శక్తి" యూనిట్ షూటింగ్ చేయబోతోంది. ఎన్టీఆర్ సరసన సెక్సీ బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీగా తెరకెక్కుతోందని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో ఈ చిత్రం భారీగా ఉంటుందని తెలుస్తోంది. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం తన కెరీర్ లోనే సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని ఎన్టీఆర్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోటప్రసాద్, డి.ఎస్.కన్నన్ రచనా సహకారం, సత్యానంద్ మాటలు, పాటలు...సిరివెన్నెల, రామజోగయ్య శాస్త్రి, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమీరా రెడ్డి కెమెరా వర్క్ చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X