Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వెంకట్ రెడ్డిపై జూ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫిర్యాదు
గ్రేట్ఆంధ్రా.కామ్ వెబ్ సైట్ నిర్వాహకుడు వెంకట్ రెడ్డిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, సినీ నటులు శివాజీ, నారా రోహిత్ శుక్రవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ హీరోపై అసభ్య కథనాలు తన వెబ్ సైట్ లో పబ్లిష్ చేసినందుకు గాను ఈ ఫిర్యాదు చేసినట్లు జూనియర్ అభిమానులు ఓ టీవీ ఛానల్ కు వెల్లడించారు. ఈ వ్యవహారంపై హీరో శివాజీ ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ....అది గ్రేట్ఆంధ్రా.కామ్ కాదని బూతు ఆంధ్రా అని హీరో ఆరోపించారు. వెంకట్ రెడ్డి జర్నిలిస్టు కాదని, ఓ పిచ్చోడని మండి పడ్డారు. ప్రముఖలను బ్లాక్ మెయిల్ చేసే వాడని ఆరోపించారు. తాను ఎన్నారైని అంటూ వెంకట్ రెడ్డి విర్రవీగుతుండేవాడని, అతని ఆచూకి కోసం రెండు సార్లు అమెరికా కూడా వెళ్లానని శివాజీ చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు నిర్వహిస్తున్న వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని శివాజీ డిమాండ్ చేశారు.
గ్రేట్ఆంధ్రా.కామ్ పై ఇప్పటికే మూడు ఫిర్యాదులు అందాయని, ఆ వెబ్ సైట్ పై తగిన చర్యలు తీసుకుంటామని సీసీఎస్ డీసీపీ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. కాగా... కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఓ అసత్య కథనం తన వెబ్ సైట్ లో పబ్లిష్ చేసినందుకు గాను ఇప్పటికే వెంకట్ రెడ్డిని పోలీసులు బెంగుళూరులో అరెస్టు చేశారు.