Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వెంకట్ రెడ్డిపై జూ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫిర్యాదు
గ్రేట్ఆంధ్రా.కామ్ వెబ్ సైట్ నిర్వాహకుడు వెంకట్ రెడ్డిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, సినీ నటులు శివాజీ, నారా రోహిత్ శుక్రవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ హీరోపై అసభ్య కథనాలు తన వెబ్ సైట్ లో పబ్లిష్ చేసినందుకు గాను ఈ ఫిర్యాదు చేసినట్లు జూనియర్ అభిమానులు ఓ టీవీ ఛానల్ కు వెల్లడించారు. ఈ వ్యవహారంపై హీరో శివాజీ ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ....అది గ్రేట్ఆంధ్రా.కామ్ కాదని బూతు ఆంధ్రా అని హీరో ఆరోపించారు. వెంకట్ రెడ్డి జర్నిలిస్టు కాదని, ఓ పిచ్చోడని మండి పడ్డారు. ప్రముఖలను బ్లాక్ మెయిల్ చేసే వాడని ఆరోపించారు. తాను ఎన్నారైని అంటూ వెంకట్ రెడ్డి విర్రవీగుతుండేవాడని, అతని ఆచూకి కోసం రెండు సార్లు అమెరికా కూడా వెళ్లానని శివాజీ చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు నిర్వహిస్తున్న వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని శివాజీ డిమాండ్ చేశారు.
గ్రేట్ఆంధ్రా.కామ్ పై ఇప్పటికే మూడు ఫిర్యాదులు అందాయని, ఆ వెబ్ సైట్ పై తగిన చర్యలు తీసుకుంటామని సీసీఎస్ డీసీపీ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. కాగా... కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఓ అసత్య కథనం తన వెబ్ సైట్ లో పబ్లిష్ చేసినందుకు గాను ఇప్పటికే వెంకట్ రెడ్డిని పోలీసులు బెంగుళూరులో అరెస్టు చేశారు.