Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
జూ ఎన్టీఆర్ ఒకేసారి సైమంటేనియస్ గా రెండు ప్రొజెక్ట్స్...!
జూ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతోందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్ గోపాల్ రెడ్డి సమర్పణలో కెఎల్ నారాయణ నిర్మిస్తున్నాడు. ఈ బేనర్ లో కృష్ణవంశీ డైరెక్షన్ లో 'రాఖీ" చేసిన జూ ఎన్టీఆర్ కి ఆ సినిమా తర్వాత మరో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారట. అప్పటి నుంచి ఎన్టీఆర్ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండడంటో మళ్ళీ ఈ బేనర్ లో సినిమా చేయ్యడానికి వీలు పడలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి తమ బేనర్ లో ఎన్టీఆర్ సినిమా చెయ్యబోతున్నందకు కెఎల్ నారాయణ ఎస్ గోపాల్ రెడ్డి చాలా హ్యాపీగా వున్నారు.
సో త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాన్న కోరిక తీరబోతుంది. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీనుతో దమ్ము చిత్రం చేస్తున్న విషయం విధితమే. ఆ తర్వాత శ్రీనువైట్ల, దర్శకత్వంలో తెరకెక్కే మాఫియా చిత్రం మొదలవుతుంది. ఈ సమయంలోనే ఎన్టీఆర్ ప్యారలల్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమాని చెయ్యబోతున్నాడని తెలుస్తుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీ హీరోగా హనీ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత త్రిక్రమ్ ఈ ప్రాజెక్ట్ తో బిజీ అవనున్నాడట.