జూ ఎన్టీఆర్ తొలి చిత్రం రెమ్యూనరేషన్ ఎంత?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత రెమ్యూనరేషన్ ఎంత అంటే...నిర్మాత, బ్యానర్ను బట్టి దాదాపు రూ. 9 నుంచి 12 కోట్ల వరకు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని' చిత్రానికి ఎంత పారితోషికం తీసుకున్నాడో ఎవరికైనా తెలుసా...? ఎంతో ఆసక్తిని గొలిపే ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈచిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించారు. 2001లో ఈచిత్రానికి జూ ఎన్టీఆర్ రూ. 6 లక్షల రూపాయల పారితోషికం పుచ్చుకున్నాడట. రామోజీరావు లాంటి వ్యక్తి అప్పట్లో అంత పెద్ద మొత్తం కొత్తగా వచ్చిన జూనియర్కు పారితోషికంగా ఇవ్వడం గొప్ప విషయం అంటున్నారు.
తాజాగా రాబోయే సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ 12కోట్లు రూపాయలు పారితోషికం తీసుకోబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కప్రకారం చూస్తే....యంగ్ టైగర్ పారితోషికం 10 ఏళ్లలో దాదాపు 200 రెట్లు పెరిగిందని స్పష్టం అవుతోంది. తన కెరీర్లో 'స్టూడెంట్ నెం.1' చిత్రంతో తొలి హిట్ అందుకున్న జూనియర్ ఆతర్వాత ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో అగ్రహీరోగా ఎదిగాడు.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండా.....బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బేనర్పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











