Don't Miss!
- News రిజల్ట్ తరువాత సీఎం కుర్చీ హుష్ కాకి, హైకమాండ్ వెయిటింగ్, గాలి జనార్దన్ రెడ్డి సంచలనం
- Finance Adani-Birla: అదానీని టార్గెట్ చేసిన బిర్లా.. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు..
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘దమ్ము’ చూపించడానికి బిజీ అవుతున్న జూ ఎన్టీఆర్.!?
జూ ఎన్టీఆర్ ఊసరవెల్లి నుంచి బయటికొచ్చి ఇప్పుడు 'దమ్ము" షూటింగ్ లో బిజీ అయిపోయాడు. శనివారం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యిన ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లోనే స్టార్ట్ అవ్వాల్సింది. 'ఊసరవెల్లి" షూటింగ్ లో ఎన్టీఆర్ కి గాయం కావడం వల్ల కొంత డిలే అయింది. ఇంతకు ముందు రెండు షెడ్యుళ్ల షూటింగు జరిగిన సంగతి తెలిసిందే. ఆ షూటింగులో యన్టీఆర్, శృతి హాసన్ లపై రొమాంటిక్ సన్నివేశాలు; యన్టీఆర్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీలపై యాక్షన్, కామెడీ సన్నివేశాలను చిత్రీకరించారు. 'ఊసరవెల్లి' సినిమా రిలీజైపోవడంతో యన్టీఆర్ ఇక పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టాడు.
'సింహా" వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న ఈ చిత్రంపై ఎన్టీఆర్ అభిమానులు చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. శతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాండర్ వల్లభ నిర్మాత. కాగా, ఇందులో సెక్సీ నమిత ఓ ఐటెం సాంగ్ చేయనుందని తెలుస్తోంది. యన్టీఆర్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.జనవరి వరకు జరిగే షూటింగ్ తో సినిమా కంప్లీట్ అవుతుంది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.