ఎన్టీఆర్,మిగతా సెలబ్రెటీలు ఓటేస్తూ (ఫొటోలు)
హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఫొటోలు మీరు క్రింద స్లైడ్ షోలో చూడవచ్చు.
అనంతరం సిరా గుర్తును చూపిస్తూ.. సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘మేం ఓటు వేశాం.. మీరూ వేశారా.. లేదంటే ఇప్పుడే వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోండి' అని కోరారు. వారిలో ఎన్టీఆర్ ఒకరు.
జూబ్లీహిల్స్లోని ఓబుల్రెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
స్లైడ్ షోలో ఫొటోలు...

ఎన్టీఆర్ మాట్లాడుతూ..
గత కొంతకాలంగా ..ఓటింగ్పై ప్రజల్లో అవగాహన పెరుగుతోందన్నారు.

కోరారు
ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ... రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని ఆకాంక్షించారు.

అలాగే..
ఓటు వేస్తే ప్రశ్నించే హక్కు వస్తుందని సినీనటుడు ఎన్టీఆర్ అన్నారు.

బాలయ్య ఓటు..
జూబ్లీహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నాగ్
జూబ్లీహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో సినీనటుడు అక్కినేని నాగార్జున, అమల దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మనోజ్, లక్ష్మి ప్రసన్న
మంచు మనోజ్ తన సోదరి మంచు లక్ష్మి ప్రసన్న ఇద్దరూ ఓటు హక్కుని వినియోగించుకున్నట్లు తెలియచేసారు.

అల్లు అర్జున్
ఓటు హక్కు తప్పని సరిగా వినియోగించుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసారు అల్లు అర్జున్.


Click it and Unblock the Notifications











