తాత గెటప్ లో ఎన్టీఆర్

ఉదయం 10 గంటలకు ఇచ్ఛాపురంలో రోడ్షో ప్రారంభమవుతుంది. ఇక ఆ ఉపన్యాసాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన సామాజిక న్యాయం, రాష్ట్రంలో తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ రగిలించిన స్ఫూర్తి, మళ్లీ అధికారంలోకి వస్తే చేయబోయేవి.. వీటితో పాటు స్థానిక సమస్యలను ఎన్టీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావిస్తారని సమాచారం. ఇక ఇప్పటికే తాను పర్యటించబోయే అన్ని ప్రాంతాల పరిస్థితులు, స్థానిక సమస్యలు తదితరాలన్నింటిపై ఎన్టీఆర్ వివరాలు తెప్పంచుకుని అవగాహన పెంచుకున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ చైతన్యరథం కూడా తయారైంది. ఇచ్ఛాపురంలో ప్రారంభమయ్యే జూనియర్ యాత్ర ఏకబిగిన 40రోజుల పాటు కొనసాగుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను ఈ యాత్ర సాగుతుంది.మరి తాత గెటప్ లో ప్రజల్లోకి వెళుతున్న ఎన్టీఆర్ ఏ మేరకు జనాకర్షణ పొందనున్నారో చూడాలి.


Click it and Unblock the Notifications











