భద్రాద్రిలో సందడి చేసిన జూ ఎన్టీఆర్ దంపతులు (ఫోటోస్)
యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మిప్రణతి దంపతులు భద్రాచలం రామయ్యను శుక్రవారం దర్శించుకున్నారు.
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భద్రాచలంలోని శ్రీరామచంద్రమూర్తి స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తన భార్య లక్ష్మీ ప్రణితితో కలిసి భద్రాద్రి వచ్చిన ఆయన రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఎన్టీఆర్ దంపతులతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా భద్రాచలం వచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు ఎన్టీఆర్ దంపతులకు స్వాగతం పలికారు.

భద్రాద్రి రామయ్య వద్ద జూ ఎన్టీఆర్
భద్రాచలం రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ఎన్టీఆర్ దంపతులు. వారితో పాటుగా దర్శకుడు కొరటాల శివ దృశ్యం ఒక్కడ చూడొచ్చు.

లక్ష్మీ ప్రణతి
భద్రాద్రిలో సీతా రామయ్య సమక్షంలో తన రాముడితో కలిసి నందమూరి లక్ష్మీ ప్రణతి. చాలా గ్యాప్ తర్వాత ఇద్దరూ కలిసి సీతారామచంద్రమూర్తిని దర్శించుకున్నారు.

భారీగా అభిమానులు
ఎన్టీఆర్ భద్రాచలం వచ్చిన విషయం తెలిసి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా జనం పోగవ్వడంతో కాస్త తోపులాట జరిగింది.

ఎన్టీఆర్కు జ్ఞాపిక
ఎన్టీఆర్ భద్రాచలం వచ్చిన సందర్భంగా ఆయనకు అభిమానులు ఒక జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్తో కలిసి ఎన్టీఆర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

కొరటాల శివ
భద్రచాలంలో దర్శకుడు కొరటాల శివతో కలిసి జూ ఎన్టీఆర్. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో ‘జనతాగ్యారేజ్' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి త్వరలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.


Click it and Unblock the Notifications











