twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ వివాహా విందుకు-పాక శాస్త్రంలో సిద్దహస్తులు...!

    By Sindhu
    |

    స్వతహాగా సీదా సాదా బట్టల్లో హంగూ ఆర్బాటాలు లేకుండా ఉండాలనే మనస్తత్వంగల జూ ఎన్టీఆర్ తన వివాహానికి మాత్రం ప్రత్యేకమైన వస్త్రాలంకరణ, విశేషమైన ఏర్పాట్లు ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వివాహం తన ఒక్కడికీ సంబంధించింది కాదు. ఇరువైపులా రెండు వంశాల పేరు ప్రతిష్టలకు అనుగుణంగా, అందరూ కలకాలం గుర్తుంచుకునేట్టుగా, వివాహం వేడుకగా జరగాలన్నది ఎన్టీఆర్ అభిలాష. శుభలేఖలో తాత ఎన్టీరామారావునే కాకుండా ఆయన తల్లిదండ్రుల ఛాయాచిత్రాలను కూడా అచ్చువేయటంలో జూ ఎన్టీఆర్ కి తన వంశస్తుల మీద ఉన్న అభిమానతంతో పాటు తన వెనుక నున్న మూడు తరాల గుర్తు చేసుకోవటం, అందరికీ తెలయజేయటం అన్నది భారతీయ ప్రాచీన సాంప్రదాయాన్ని ఎంత గౌరవింస్తున్నారో తెలుస్తోంది.

    ఎన్టీార్ అభిలాషకి దీటుగా ధర్మవరం నుంచి నవరత్నాలు పొదిగి ప్రత్యేకంగా నేసిన చీర వచ్చింది భద్రాచల సీతారాముల కళ్యాణంలో ఉపయోగించిన ముత్యాల తలంబ్రాలు వచ్చాయి. అభిమానల ఆనందానికి అవధులు లేవు. ఎన్టీఆర్ ప్రణతిల మీద వసంత్ ఒక మధుర గీతాన్ని రచించగా, అమిర్నేని రామకృష్ణ ఈ గీతా నిర్మాణానికి పూనుకున్నారు, గీతా మాధురి, శ్రీకృష్ణ ఆలపించిన ఈ గీతానికి అర్జున్ స్వరకల్పన చేసారు.

    శరవేగంగా సాగుతున్న పెళ్లిపనులలో భాగంగా, హైటెక్స్ లో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ రూపొందిస్తున్న కళ్యాణ వేదిక 300మంది కృషితో 18కోట్ల రూపాయల ఖర్చుతో శోభాయమానంగా రూపుదిద్దుకుంటోంది. రేపు మే 5న జరిగే ఈ వివాహానికి విచ్చేసే 10000మంది అతిథుల సౌకర్యాల ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నారు.

    ఇక అసలైంది వివాహ భోజనం! ఎంత ఆర్భాటంగా అలంకరించినా, ఎన్ని ఏర్పాట్లు చేసినా, అతిథులను ఎంత బాగా లోపలికి ఆహ్వానించి వారి సకల సౌకర్యాలనూ చూసుకున్నా, భోజనం ఏర్పాట్లు పెళ్ళిలో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందుకే కోనసీమ ప్రత్యేకమైన పనస పొట్టు, దోసఆవ చెయ్యటానికి పాక శాస్త్రంలో సిద్దహస్తులు వచ్చేసారు. నందమూరి తారక రామారావు, నార్నే ప్రణితల వివాహం శుభప్రదంగా సుసంపూర్ణమవాలని మనసారా ఆశీర్వదించుదాం..!

    English summary
    The wedding arrangements for the marriage of Jr. NTR with Lakshmi Pranathi are progressing briskly. With just tow days left for the wedding on May 5, there is a last minute rush to complete the arrangements and decorate the kalyana mandapam. The number of people expected to attend the wedding is in the region of 10,000. Three big hotels have been booked in the Hitech city area. The catering contract has been given to an agency from Vijayanagaram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X