Don't Miss!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
జూ ఎన్టీఆర్ పెళ్ళి తర్వాత సినిమాలకు బ్రేక్!
జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి పెళ్లి నవంబర్ 18 అని డేట్ ఫిక్సయింది. పెళ్ళి తర్వాత 6 నెలల వరకు సినిమాలు చేయకూడదని ఎన్టీఆర్ అనుకుంటున్నాడని సమాచారం. అందుకోసం ఇప్పటి వరకూ తాను ఓప్పుకున్న చిత్రాలన్నింటిని పెళ్లి లోపే పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడని అతని సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. ప్రస్తతం ఎన్టీఆర్ చేస్తున్న రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. వాటిలో ముఖ్యంగా దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న బృందావనం షూటింగ్ చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే.. మరో వైపుఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో అశ్వినీదత్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకమైన వైజయంతీ బ్యానర్ లో 'శక్తి" చిత్రం కూడా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఈ రెండు చిత్రాలాను పెళ్లికి ముందే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారనీ వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ రెండు చిత్రాలు కాకుండా మరో చిత్రం కూడా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఆ చిత్రం కూడా పెళ్లికి ముందే షూటింగ్ జరపాలి అనే కండిషన్ పెట్టిన ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం వరుసగా 45 రోజులు ఫుల్ డేట్స్ ఇచ్చాడని సమాచారం. ఇంతకీ ఈ చిత్రాన్ని ఎవరు రూపొందిస్తున్నారో తెలుసా! గతంలో ఎన్టీఆర్ తో 'ఆంధ్రావాలా" చిత్రాన్నీ రూపొందించిన పూరీ జగన్నాథ్. ఎన్టీఆర్ కు సరైన హిట్ ఇవ్వలేక పోయాను అని బాధ పడుతున్న పూరీ ఈ సారి బలమైన కథను రెడీ చేశాడు. ప్రస్తుతం గోపిచంద్ 'గోలిమార్" పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ చిత్రానికి శ్రీకారం చుట్టడానికి అతను కూడా రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నాడనీ సమాచారం.