Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తారక్పై వస్తున్న వార్తలు నిజమే: కన్ఫార్మ్ చేసిన బడా నిర్మాత
Recommended Video
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఊపులోనే అతడు తాజాగా మరో బడా ప్రాజెక్టు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'RRR'లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తారక్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.
‘కేజీఎఫ్' డైరెక్టర్తో సినిమా
‘కేజీఎఫ్' అనే సినిమాతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో యశ్ను ఎంతో ఎలివేట్ చేసి చూపించిన తీరుకు ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత ఆయనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఎంతో మంది బడా నిర్మాతలు ప్రశాంత్తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఆయనతో తారక్ సినిమా చేస్తున్నాడంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
క్లారిటీ ఇచ్చిన నిర్మాత
తారక్- ప్రశాంత్ నీల్ సినిమా గురించి తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాత నవీన్ యెర్నేని స్పందించారు. ‘‘మేము ప్రశాంత్, తారక్తో చర్చలు జరుపుతున్న విషయం నిజమే. ప్రశాంత్ వచ్చి తారక్కు స్టోరీ చెప్పి, అది ఆయనకు నచ్చితే కచ్చితంగా ముందుకు వెళ్తాం. అన్నీ ఓకే అయితే బహుశా 2020 చివర్లో మా సినిమా ప్రారంభం అవుతుంది. అప్పటికి ఎన్టీఆర్ ‘RRR', ప్రశాంత్ ‘కేజీఎఫ్.. చాప్టర్ 2' పూర్తవుతాయి'' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
గతంలోనే ప్రకటన
‘కేజీఎఫ్' విడుదలైన తర్వాత ఈ సినిమా చూసిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు.. దర్శకుడు ప్రశాంత్ నీల్తో తాము సినిమా చేయబోతున్నామని అనౌన్స్ చేసారు. అయితే, ఇందులో ఎవరు హీరోగా నటిస్తారని మాత్రం వెల్లడించడలేదు. మొదట్లో మాత్రం ఈ సినిమాను సూపర్స్టార్ మహేశ్ బాబుతో చేస్తారని ప్రచారం జరిగినా.. ఇప్పుడు తారక్ వైపు మళ్లింది.
‘కేజీఎఫ్.. చాప్టర్ 2' గురించి..
‘కేజీఎఫ్.. చాప్టర్ 1' భారీ సక్సెస్ సాధించడంతో చిత్ర యూనిట్ దీనికి సీక్వెల్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ‘కేజీఎఫ్.. చాప్టర్ 2' షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2020లో విడుదల కాబోతుంది. గతంలో ఈ సినిమా కోసం ఆడిషన్స్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ మాత్రం రాజమౌళికి లాక్
తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో కలిసి ‘RRR'లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు.. అందునా బడా డైరెక్టర్ ఉండడంతో ఈ కాంబినేషన్ తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కాబోతోంది.