Don't Miss!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ అదుర్స్
నటుడు, నిర్మాత మురళీమోహన్ నిర్మాణంలో జయభేరి ఆర్ట్స్ బేనర్ లో జూ.ఎన్టీఆర్ తో దర్శకుడు రాజమౌళి ఒక సినిమా నిర్మించనున్నట్లు సినిమా వర్గాల సమాచారం. అలా జరిగినట్లైతే మహేష్ బాబతో తీసిన 'అతడు" తర్వాత మురళీమోహన్ నిర్మిస్తున్న చిత్రమిదే అవుతుంది.
'మగధీర"తో దర్శకధీర అనిపించుకుని వరుసగా ఏడో హిట్ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి చిత్రంలో నటించాలని ఎవరికి ఉండదు? ప్రస్తుతం ఆయన కోయంబత్తూర్లో నెక్ట్స్ సినిమా స్టోరీ డిస్కషన్ లో నిమగ్నమై ఉన్నారు. సునీల్, సలోని జంటగా ఈ సినిమా రూపోందుతోంది. నెల రోజుల క్రితం ఈ సినిమా ఓపెనింగ్ రామానాయుడు స్లూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా అనంతరం ఆయన దర్శకత్వంలో ప్రభాస్ నటించే అవకాశాలు మెరుగ్గావున్నాయి. ఈ రెండూ పూర్తయిన తర్వాత జూ.ఎన్టీఆర్ తో తీసే నాలుగో చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.