twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బస్తీమే సవాల్ జూ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు

    By Sindhu
    |

    టాలీవుడ్ లో నెక్స్ట్ నెంబర్ వన్ ఎవరు..ప్యూచర్ మెగాస్టార్ ఎవరు అనే ప్రశ్నలకు అక్టోబర్ నెల అన్సర్ చెబుతుందని ఆశించవచ్చు. ఎందుకంటే ఈ పోటీలో ప్రధానంగా పేర్కొంటున్న మహేష్, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ముగ్గురు స్టార్స్ ఈ సారి ఒకే సీజన్ లో తలపడనున్నారు. వీరి చిత్రాలు వరుసగా రానున్నాయి, అందులో ముందుగా జూ ఎన్టీఆర్ తాజా చిత్రం 'బృందావనం" రాబోతోంది. ఆగస్ట్ 24న 'బృందావనం" విడుదల తేదీగా చెబుతున్నారు కానీ అది సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయట.

    అలాగే మహేష్ బాబు-త్రివిక్రమ్ ల చిత్రం ఆగస్ట్ లో వస్తుందని అన్నారు. అయితే ఇంకా నాలుగు పాటలను చిత్రీకరించాల్సి వున్నందున ఇది కూడా సెప్టెంబర్ లోనే రావచ్చు అని సమాచారం. ఇక రామ్ చరణ్ 'ఆరంజ్" ని ప్రేక్షకులకు దసరా కానుకగా ఇవ్వనున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకొని దాదాపుగా టాకీపార్ట్ కంప్లీట్ చేసేసుకున్న 'ఆరంజ్" అక్టోబర్ లో రావడం ఖాయం అని చెబుతున్నారు ఆ చిత్ర వర్గం. అయితే రానున్న విజయదశమికి ఈ హీరోల విజయాలు, బాక్సాఫీస్ లో వసూళ్ల వర్షం కురిపించే శక్తి సామర్ధ్యాలు నిరూపితమవుతాయి కనుక నెంబర్ వన్ రేస్ లో ముందడుగు వేసేదెవరో తేలుతుందని వ్యాఖ్యానిస్తున్నారు సినీ అభిమానులు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X