Don't Miss!
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఎన్టీఆర్ ఇన్నాళ్ళకు కరుణించాడు
హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయాలంటే చాలా పోటీ ఉంటుంది. అయితే కథతో ఒప్పించుకుని, అతనితో సాన్నిహిత్యమున్న వక్కంతం వంశీ లాంటి రచయితకి అది అసాధ్యం మాత్రం కాదు. చాలా కాలం క్రితమే ఎన్టీఆర్ తో చిత్రం అని వక్కంతం వంశీ మీడియాకు తెలియచేసారు. అయితే ఎన్టీఆర్ వరసగా ప్రాజెక్టులు ఒప్పుకుంటూండటంతో అంతా ఎన్టీఆర్ ...వక్కంతం కు హ్యాండ్ ఇచ్చాడని చెప్పుకోవటం మొదలెట్టారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వక్కంతం వంశీ ని ఆనంద పరిచారు.
'కిక్', 'వూసరవెల్లి', 'ఎవడు', 'రేసుగుర్రం'... ఇందులో కథ ఏదైనా సరే, కథానాయకుడి శైలికి సరిపడే వాణిజ్య అంశాల్ని మేళవిస్తూనే, ప్రేక్షకులకు కొత్తదనం రుచిచూపించాయి. వూహకందని మలుపులు ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ కథల్ని అందించి, ఆ చిత్ర విజయాల్లో కీలక పాత్ర పోషించారు వక్కంతం వంశీ. ఇప్పుడు ఈ రచయిత మెగాఫోన్ పట్టబోతున్నారు. అదీ.. ఎన్టీఆర్ సినిమాతో.
ఆమధ్య ఎన్టీఆర్కి కథ వినిపించారు. అది ఎన్టీఆర్కి నచ్చడం, పచ్చజెండా వూపడం జరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ నిర్మించబోతున్నారు.
వక్కంతం వంశీ మాట్లాడుతూ... ''ఎన్నో యేళ్ల కల.. ఈ సినిమా. ఎన్టీఆర్ అభిమానులకు ఓ పండగలా ఉండబోతోంది. స్క్రిప్టు చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు చెబుతా'' అంటున్నారు వంశీ.