Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
జూ ఎన్టీఆరా మజాకా 5కోట్లతో సెట్ అదుర్స్..
జూ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం శక్తి. ఈ చిత్రాన్ని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నామని ఇటీవలే నిర్మాత అశ్వనీదత్ తెలిపాడు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా కోసం 5కోట్లు ఖర్చు పెట్టి ఓ సెట్ వేసారట. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి ఆధ్వర్యంలో ఈ సెట్ వేయడం జరిగింది. సెట్ చాలా అధ్బుతంగా ఉందని తెలుస్తుంది. ఇందులో ఓ పాట చిత్రీకరణ జరగనుందని సమాచారమ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇలియానా జత కట్టింది.
కాగా ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రచ్చ" సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందిస్తున్నాడు. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'కిక్" చిత్రానికి కూడా వక్కంతం వంశీయే స్ర్కిప్ట్ ఇచ్చాడు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీలది క్రేజీ కాంబినేషన్ గా చిత్ర పరిశ్రమ భావిస్తోంది.