Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మా ఫస్ట్ కాంబినేషన్ బెస్ట్ అనిపించుకునేలా: జూ ఎన్టీఆర్
మాస్ పాత్రలు పోషించడంలో జూ ఎన్టీఆర్, మాస్ ఎంటర్ టైనర్ లు తెరకెక్కించడంలో శ్రీనువైట్ల సిద్ధహస్తులు. వీరిద్దరి కాంబినేషన్ లో బండ్ల గణేష్ ఓ మాస్ ఎంటర్ టైనర్ ని నిర్మించనున్నారు. ఎన్టీఆర్ నటిస్తోన్న 'ఊసరవెల్లి" అక్టోబర్ 6 విడుదల కానుంది. ఆ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో కేఎస్ రామారావు నిర్మిస్తున్న సినిమా ఉంటుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించే సినిమా ఇదే. త్వరలో మొదలు కానున్న ఈ సినిమా గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ''శ్రీను వైట్లతో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. ఆయన కథ చెబుతున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. అంత హ్యూమర్ ఉంది ఇందులో. అలాగే నా ఇమేజ్కి తగ్గ మాస్ అంశాలు కూడా ఉంటాయి. మా ఫస్ట్ కాంబినేషన్ బెస్ట్ అనిపించుకునేలా ఈ సినిమా రూపొందనుంది" అన్నారు.
కాగా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తాడని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమన్ ఇంతకు ముందు జూ ఎన్టీఆర్ 'బృందావనం" చిత్రానికి సంగీతం అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి పని చేసే సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తున్నారు. ఛాయాగ్రహణం బాధ్యత గుహన్ నిర్వహిస్తారని ఇప్పటికే వెల్లడైంది. ఇప్పుడు సంగీత దర్శకత్వం తమన్ నిర్వహణలో జరుగుతుందని తెలిసింది. ప్రస్తుతం 'ఊసరవెల్లి" చిత్రాన్ని ముగించుకుంటున్న ఎన్.టి.ఆర్. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారు అని తెలిసింది. ఒక ప్రముఖ కథానాయిక ఈ చిత్రం లో నటించబోతోంది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు. దర్శకుడు శ్రీను వైట్ల కు 'దూకుడు ' తరువాత ఇదే తదుపరి చిత్రం.