twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి సంకెళ్ళు వేసి లవర్ బాయ్ కి లైసెన్స్ పొందాడా...

    By Sindhu
    |

    'బృందావనం" సాధించిన ఘన విజయం ఇటు ఇండస్ట్రీకే కాదు..అటు జూ ఎన్టీఆర్ కీ సరికొత్త ఊపునిచ్చింది. ఉత్సాహాన్ని పెంచింది. ఇప్పుడు ఒక్క 'బృందావనం" విజయంతోనే ఆ సర్కిల్ లోంచి పూర్తిగా బయటికొచ్చేశాడని అనలేం కానీ తన పరిధుల పరిమితిని మాత్రం చాలా వరకూ పెంచుకోగలిగాడని స్పష్టంగా చెప్పొచ్చు. గత కొన్నాళ్ళుగా తన చేతికున్న మాస్ ఇమేజ్ సంకెళ్ళను 'బృందావనం" తో తెంచేసుకున్న జూ ఎన్టీఆర్ ఇకపై లవర్ బోయ్ గా కనిపించేందుకు లైసెన్స్ ని పొందాడు. ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేసేందుకూ రూట్ క్లియర్ చేసుకున్నాడు.

    కాగా ఈ పరిణామం జూ ఎన్టీఆర్ తదుపరి చిత్రాలపై ఇప్పుడు చాలా ప్రభావం చూపుతోంది. ఎలాగంటే..సురేందర్ రెడ్డి చెప్పిన 'ఊసరవెల్లి" సబ్జెక్ట్ ని ఎన్టీఆర్ ఓకే చెయ్యడం జరిగినప్పటికీ తొలుత సినిమా పేరు మార్చాలనీ, తారక్ ఇమేజ్ కి తగిన పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలనీ అనుకున్నారు. అయితే 'బృందావనం" సక్సెస్ ఇచ్చిన కాన్సిడెన్స్ తో జూ ఎన్టీఆర్ మైండ్ సెట్ మారిపోయింది. మాస్ టైటిల్స్ పెట్టేసి మరీ హైప్ పెంచేసే పాత పద్దతులకి స్వస్తి పలికి ఇకపై తన ప్రతి సినిమాకూ కథకి తగ్గ పేరుతోనే ప్రొసీడ్ అయ్యేందుకు జూ ఎన్టీఆర్ సిద్దపడుతున్నాడు..దాంతో ఎన్టీఆర్ సురేందర్ రెడ్డిల సినిమాకి 'ఊసరవెల్లి" టైటిలే కన్ ఫర్మ్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రాన్ని 'చత్రపతి" ప్రసాద్ నిర్మించనున్నారు. అన్నట్టు, జూ ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించే ఈ చిత్రంలో మరో హీరో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X