twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఇమేజ్ ను సంతృప్తి పరిచే దమ్మును చూస్తానంటున్న ఎన్టీఆర్

    By Pratap
    |

    సినిమాలో నటించడానికి ముందు తాను రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటానని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. కథ గురించే ఆలోచిస్తానని అన్నాడు. తన ఇమేజ్ ను సంతృప్తి పరిచే దమ్ము కథకు ఉందా లేదా అని చూస్తానని చెప్పాడు. ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ఆ విధంగా అన్నారు. ఎన్టీఆర్ ఇమేజ్ అంటే సాధారణ విషయం కాదని అన్నాడు. తనలోని ఆర్టిస్టును సంతృప్తి పరిచే దమ్ము కథకు ఉందా లేదా కూడా చూస్తానని చెప్పాడు. బృందావనం సినిమా చేసేటప్పుడు తాను అదే విషయం గురించి ఆలోచిస్తూ వచ్చానని అన్నాడు. ఈ సినిమా ఇంత హిట్ అవుతుందని అనుకోలేదని, నటించేటప్పుడు తాను ప్రతి సందర్భంలోనూ భయపడ్డానని చెప్పాడు. తానేమిటి, ఈ సినిమా చేస్తున్నానేమిటని అనుకున్నానని ఆయన అన్నారు. నిజంగా బృందావనం సినిమా గురించి భయపడ్డానని ఆయన అన్నారు. స్వర్గీయ ఎన్టీరామారావును మించిపోదామని తాను అనుకోవడం లేదని చెప్పాడు. తాత ఎన్టీఆర్ ను మించిపోవాలని గానీ, ఎన్టీఆర్ కు దీటుగా చేయాలని గానీ తాను ఆలోచించడం లేదని చెప్పాడు.

    దర్శకుడు ఎవరన్నారనేది ముఖ్యం కాదని, ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ సక్సెస్ ఇచ్చాడని, సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చాడని ఆయన అన్నారు. ఏడాదికి మూడు సినిమాలు చేయాలని ఉందని ఆయన చెప్పారు. గుండమ్మ కథ రీమేక్ ఎలా చేయాలో ఆలోచించాల్సి ఉందని ఆయన అన్నారు. అక్కినేని నాగార్జునతో మాట్లాడాల్సి ఉందని అన్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజాలను ఆయన ప్రశంసించారు. రామ్ లో ఈజ్ ఉందని చెప్పాడు. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉందని చెప్పాడు. అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని అన్నారు. తాను స్ట్రెయిట్ గా మాట్లాడుతానని, లోపలోటి బయటోటి ఉండదని చెప్పారు. వీడు మంచోడురా అని నలుగురు తన గురించి అనుకోవాలనేది తన తపన అని ఆయన అన్నారు. శక్తి చాలా శక్తిగా ఉంటుందని ఆయన చెప్పారు. బృందావనంలో కొత్తగా ఎన్టీఆర్ ఉంటారని ఆయన చెప్పారు. తన పెళ్లి త్వరలోనే ఉంటుందని, అందరికీ చెప్తానని ఆయన అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X