Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వెంకటేష్ కథ తో...ఎన్టీఆర్?
ఆ మద్య వెంకటేష్ హీరో గా మెహెర్ రమేష్ ఓ కథ చెప్పి ఓకె అనిపించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వెంకటేష్ తో శ్రీను వైట్ల, అమ్మ రాజశేఖర్ సినిమాలు ముందుకు రావటంతో మెహర్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. దాంతో అదే కథతో మెహర్ వెంటనే ఎన్టీఆర్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. కథ విన్న ఎన్టీఆర్ తన అంగీకారాన్ని తెలిపినట్లు చెప్తున్నారు. కంత్రి సమయం లోనే ఎన్టీఆర్ వద్ద మార్కులు కొట్టేసిన మెహర్ తన లేటెస్ట్ ప్రభాస్ బిల్లా చిత్రం తో స్టైలిష్ దర్శకుడు అనిపించుకున్నాడు. అదే అతనికి వర్కౌట్ అదే అతనికి కలసి వచ్చిన అంసం. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ, మెహర్ రమేష్ చెప్పిన స్టోరీ తనకు బాగా నచ్చిందనీ, మళ్లీ 'కంత్రి' కాంబినేషన్ రిపీట్ అవుతుండటం, దత్తుగారి బ్యానర్ లో చేస్తుండటం తన అదృష్టంగా భావిస్తున్నాననీ అన్నారు.
వైజయంతీ సంస్థ నిర్మిచిన అన్ని చిత్రాల్లోనూ బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ గా ఉంటుందనీ, తారక్ తో చేస్తున్న ఈ చిత్రం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో గ్రాండ్ లొకేషన్లలో అత్యం భారీగా ప్లాన్ చేశామనీ అశ్వనీదత్ తెలిపారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నుంచి వస్తున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇదని పేర్కొన్నారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ, 'కంత్రి' వంటి హిట్ తర్వాత తారతో అశ్వనీదత్ గారి బ్యానర్ లో చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సబ్జెక్ట్ వినగానే తారక్, దక్ ఎక్స్ టార్డినరీగా ఉందంటూ అభినందించారనీ, వైజయంతీ బ్యానర్ లో ఓ సెన్సేషన్ హిట్టిచ్చే అవకాశం తనకు మరోసారి వచ్చిందనీ అన్నారు. అక్టోబర్ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. చలసాని ధర్మారావు సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఇందులో ఇలియానా కథానాయికగా నటించబోతోంది. ఈమె గతంలో ఎన్టీఆర్ 'రాఖీ'లో ఆడిపాడింది.