Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్తో తమన్ పని చేయడం కూడా ఇదే తొలిసారి. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైన సందర్భంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్తో కలిసి దిగిన ఫోటోను తమన్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
#TTT 💪🏼✊ pic.twitter.com/9jzoMHaWwy
— thaman S (@MusicThaman) May 11, 2018
ఎన్టీఆర్ కెరీర్లో 28 సినిమా ఇది. టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. 'అసామాన్యుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్నే ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ టైటిల్ ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని తెలుస్తోంది.
యంగ్ టైగర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఎన్ఠీఆర్-పూజా హగ్డే కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. ఇంతకు ముందు ఈ చిత్రానికి అను ఇమ్మాన్యుయేల్ అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో దర్శకుడి నిర్ణయం మారింది.
'జై లవ కుశ' సినిమా తర్వాత ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాపులో సినిమాలోని పాత్ర కోసం తన బాడీ షేపులు మార్చుకున్నాడు. స్టీవెన్ లాయిడ్ అనే విదేశీ ట్రైనర్ సమక్షంలో ట్రైన్ అయి సరికొత్త స్లిమ్లుక్ లోకి మారిపోయాడు. గత సినిమాలకు భిన్నంగా స్లిమ్ లుక్తో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నాడు.